అధికారుల విధులకు అడ్డం తగులుతూ కులం పేరుతో దూషించారని కలమట మోహనరావు (మాజీ ఎమ్మెల్యే) కుమారుడు రేమస్, గండివలస రాంప్రసాద్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కొత్తూరు దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు రాష్ర్ట కార్యదర్శి బోనెల అప్పారావు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ర్ట ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మురపాక కిరణ్ మాదిగ, మాదిగ దండోరా నియోజకవర్గ ఇంచార్జి, కొత్తూరు మండల మాలమహనడు అధ్యక్షుడు తొంపల తిరుపతిరావులు ధర్నా చేపట్టారు. శ్రీకాకుళంలోని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పర్యటన సందర్భంగా కలమట రమేష్, రాంప్రసాద్లు కొత్తూరు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఇతర రెవెన్యూసిబ్బందిపై దూషణలకు దిగారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారిని వెంటనే అరెస్టు చేయాలని ఫ్లకార్డులు చేతబూని ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయా సంఘాల నేతలుమాట్లాడుతూ. ఈ సంఘటనపై వెంటనే ఎస్పీ జోక్యం చేసుకోవాలని కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడుల నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కి చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమన రమేష్, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాంబాబు, దళిత మహాసభ నవ్యవస్థాపక అధ్యక్షుడు దుర్గాసి జమ్మయ్య, రెళ్లికూల సంక్షేమ సంఘం నాయకులు బొమ్మాలి గుమ్మయ్య, బొడ్డేపల్లి కృష్ణారావు, బహుజన సమాజ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దోమన మోహనరావు, దులి అప్పన్నట్, యాకసి, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు డి అప్పలస్వామి, కంఠ పాపయ్య, బాణాల బైరేగి, నాసా శివశంకర్, కోనూరు గణపతి, కాలగటి బైరేగి తదితరులు పాల్గొన్నారు.