విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు విజయనగరం రూరల్ సర్కిల్, రూరల్ పోలీసు స్టేషను పరిధిలో చెల్లూరు జాతీయ రహదారి వద్ద స్టాపర్స్ ని ఏర్పాటు చేసారు. యాక్సిడెంట్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ టివి తిరుపతిరావు మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా వాహనాల వేగం నియంత్రించి, ప్రమాదాల జరగకుండా స్టాపర్లు ఉపయోగ పడతాయన్నారు. వాహన చోదకులు రహదారి నియమాలను పాటించాలని, ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ లు సీట్ బెల్ట్ లు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
previous post