29.7 C
Hyderabad
May 6, 2024 06: 08 AM
Slider రంగారెడ్డి

ఒకే రోజు వెయ్యి మందికి ప్రయివేటు ఉద్యోగాలు

#MPRanjitReddy

ఒకే రోజు వెయ్యి మందికి  వివిధ  ప్రైవేటు కంపెనీల లో’ఉద్యోగ అవకాశాలు’ కల్పిస్తున్నామని చేవెళ్ల ఎం.పి డాక్టర్ రంజిత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 11 వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే జాబ్ మేళా  వివరాలను  స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు.

రాబోయే 2 నెలల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని యువత వారి విద్యార్హతలను మాకు తెలియజేసినట్లయితే వారికి  భోజన వసతులతో కూడిన ఉచిత’ స్కిల్ డెవలపమెంట్’ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

జాబ్ మేళా లో పాల్గోనే నిరుద్యోగ యువత ‘www.hyseplacements.com’లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి ఆయన సూచించారు. Hope foundation చైర్మన్ విజయ్ కుమార్ ను అలాగే hyseplacements సంస్థ ప్రతినిధి మనీష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీల రోజువారి వేతనాలు పెంచాలి

Satyam NEWS

రోల్ మోడల్ గా ఖమ్మం

Bhavani

మన రాజ్యాంగాన్ని పౌరులు అందరు గౌరవించాలి

Satyam NEWS

Leave a Comment