కడప జిల్లా రాజంపేట సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రభూమి టౌన్ రిపోర్టర్ పిడుగు శ్రీనువాసులు (58 ) బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. 1980 నుండి ఇప్పటి వరకు 40 సంవత్సరాల పాటు ఉదయం, ఆంధ్రభూమి లాంటి లీడింగ్ పేపర్లలో జర్నలిస్టుగా సేవలందించారు.
ఒక సీనియర్ జర్నలిస్ట్ ను కోల్పోవడం పత్రికా రంగానికి తీరని లోటని అయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్దిస్తున్నామని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.