27.7 C
Hyderabad
May 4, 2024 07: 54 AM
Slider మహబూబ్ నగర్

రైతుకు ఆర్థిక సహాయాం అందజేసిన జర్నలిస్టు

#GadwalJournalist

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని గద్వాల డీఎస్పీ యాదగిరి అన్నారు. ఇటీవల్ల ధరూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి రామన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు  ప్రమాదవశాత్తు మన్నాపురం గ్రామ శివారులోని చెరువులో పడి మృతి చెందాయి.

వీటి విలువ సుమారు రూ.1లక్ష 50వేలు ఉన్నాయి. కాడె ఎద్దులను కోల్పోయిన రైతుకు అండగా ఉండేందుకు  టీయుడబ్ల్యూ ఐజేయు జోగుళాంబ గద్వాల జిల్లా అద్యక్షులు, ఆంధ్రభూమి స్టాప్ రిపోర్టర్ ధరూర్ శ్యామ్ తన వంతుగా రూ.50,000(యాబైవేల‌ రూపాయలు) ఆర్థిక సహాయం చేశారు.

శనివారం ధరూర్ లో గద్వాల డీఎస్పీ ఎ.యాదగిరి చేతుల మీదుగా రూ.50,000 రైతు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గద్వాల డీఎస్పీ మాట్లాడుతూ…. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కష్టాలలో ఉన్నప్పుడు మానవతాదృక్పథంతో మన వంతుగా వారిని ఆదుకోవాలని సూచించారు.

నిత్యం సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్న‌ జర్నలిస్టులు ఈ రోజు  రైతన్నలు‌‌ కష్టాలలో ఉన్నాడని ముందుకు వచ్చి ఆదుకోవడం అభినందనీయం అన్నారు. సమాజానికి సేవ చేయడంలో లభించే సంతోషం మరెందులోనూ దొరకదన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ ఎస్ఐ రాములు, డీ.ఆర్. శ్రీధర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ నటుడు జయప్రకాష్‌రెడ్డి ఇకలేరు

Satyam NEWS

కొల్లాపూర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వలసలు

Satyam NEWS

ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం

Bhavani

Leave a Comment