విజయనగరం కలెక్టరేట్ లో మీడియాతో విద్యా శాఖ మంత్రి బొత్స
జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు తగ్గింపుపై..ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని..ఒక వేళ ఫీజు తగ్గింపుపై జీఓ గాని మెమో గాని ఉంటే చూపించాలన్నారు….విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. భారీవర్షాల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో .10.36 కోట్లతో 27 రహదారుల మరమ్మత్తులకు ప్రతిపాదించినట్లు మంత్రి బొత్స తెలిపారు రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయడం లేదని…విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు..విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా పాఠశాలల విలీనం మాత్రమే చేస్తున్నామని స్పష్టీకరించారు.
మంత్రి. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను 3వ తరగతి నుంచే నియమిస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్ధులకు 5 లక్షల ట్యాబ్లు ఉచితంగా అందజేస్తున్నామని , నాడు – నేడు ఫేజ్ -1 పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని.. పూర్వ ప్రాధమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కార్యకర్తతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తున్నామన్నారు.
ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నామని కెజిబివి లు వున్న చోట కళాశాలల్ని వేరే చోటుకు తరలించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.. మంత్రి బొత్స. అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకే జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ప్రారంభించామని.., 200లోపు ర్యాంకింగ్ వున్న సంస్థల విషయంలో అవసరమైతే పెంచే విషయం ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే బోధన జరగాలని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.