గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఇందిరా నగర్ లో ఊట్ల సత్యవతి అనే మహిళ రెండు కిడ్నీలు చెడిపోవటం తో ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా తన వైద్య ఖర్చులకు సాయం అందించాలని కోరింది. ఈ నేపథ్యంలో స్థానిక జర్నలిస్టులు బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు, మద్దెల కిషోర్ లు తమ మిత్రుల సహకారంతో బాధితురాలికి సోమవారం రూ.5 వేలు ఆర్ధిక సాయం అందజేశారు.ఈ నగదును వారు ఇందిరా నగర్ లోని బాధితురాలి నివాసానికి వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.
previous post