తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ పట్టణం లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిజెపి నాయకురాలు, స్వర్గీయ సుష్మాస్వరాజ్ చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ తాలూకా కన్వీనర్ కొంగ సత్యనారాయణ ,పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ పాల్గొన్నారు.
ఇంకా మండల బీజేపీ మహిళ నాయకురాలు డా. కొత్తపల్లి అనిత, పట్టణ మహిళ అధ్యక్షురాలు జాడి శైలేజ, రాణి, వీరభద్ర చారి, శరద్ శర్మ, మెడి కార్తిక్, గుంమ్ముల సాయి కృష్ణ, అరుణ్ దొంగరే, రాజశేఖర్, మాచర్ల శ్రీనివాస్, మల్లేష్, దిలీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.