32.7 C
Hyderabad
April 27, 2024 00: 17 AM
Slider ఆదిలాబాద్

తెలంగాణా సాధించింది బిజెపి నేత సుష్మా స్వరాజ్

#BJP Sripur Kagajnagar

తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ పట్టణం లోని బీజేపీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిజెపి నాయకురాలు, స్వర్గీయ సుష్మాస్వరాజ్ చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  సిర్పూర్ తాలూకా కన్వీనర్ కొంగ సత్యనారాయణ ,పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ పాల్గొన్నారు.

ఇంకా మండల  బీజేపీ మహిళ నాయకురాలు డా. కొత్తపల్లి అనిత, పట్టణ మహిళ అధ్యక్షురాలు జాడి శైలేజ, రాణి, వీరభద్ర చారి, శరద్ శర్మ, మెడి కార్తిక్, గుంమ్ముల సాయి కృష్ణ, అరుణ్ దొంగరే, రాజశేఖర్, మాచర్ల శ్రీనివాస్, మల్లేష్, దిలీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

పాఠ్య పుస్తకాల పంపిణీ కి సరైన సమయం కాదు

Satyam NEWS

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Bhavani

Leave a Comment