31.7 C
Hyderabad
May 2, 2024 08: 26 AM
Slider రంగారెడ్డి

బిజెపి నుంచి జెంప్: ప్రజా సంక్షేమంకై తెరాస లో చేరిక

#tandur

ప్రజా సంక్షేమం ను దృష్టిలో పెట్టుకొని తెరాస లో చేరినట్లు బీజేపీ కి రాజీనామా చేసిన తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సింధూజ నరేందర్ గౌడ్ ఆమె భర్త నరేందర్ గౌడ్ తెలిపారు. గురువారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నరేందర్ గౌడ్ దంపతులు తెరాస లో చేరారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో కలిసి వెళ్లి తెరాస లో చేరారు. బీజేపీ కి రాజీనామా చేసి తెరాస లో చేరిన నరేందర్ గౌడ్ దంపతులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో సి పిఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ కూడా తెరాస లో చేరారు. తెరాస లో చేరిన నరేందర్ గౌడ్ దంపతులతో పాటు మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సూచించారు.

అంతకు ముందు సింధూజ నరేందర్ గౌడ్ దంపతులు బీజేపీ ప్రాథమిక సభ్యత్వంకు, అసిఫ్ సిపిఐ పార్టీ కి రాజీనామా చేశారు. తెరాస లో చేరిన నరేందర్ గౌడ్ దంపతులతో పాటు సిపిఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫ్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమం లో  మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, తెరాస నేతలు రాజు గౌడ్, నర్సింలు, వెంకట్ రెడ్డి, పట్టణ తెరాస ప్రెసిడెంట్ నయీమ్, మునిసిపల్ కౌన్సిలర్ మంకల్ రఘు,సోషల్ మీడియా ఇంచార్జి ఇంటియాజ్ ఉన్నారు.

Related posts

కార్యకర్తలను పరామర్శించిన భట్టి విక్రమార్క

Bhavani

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor

పోలీసు వ్యాన్ సైరన్ విని ప్రాణాలు హరీ అని

Satyam NEWS

Leave a Comment