తూర్పు గోదావరి దేవాలయాలకు అధ్యక్షురాలిగా సంచైత గజపతిని నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు ఆమెను అధ్యక్షురాలిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నిదేవాలయాలపై కన్నుపడిందని విమర్శించారు. అన్ని మతాలను ప్రభుత్వం గౌరవించాలని, ఒక్కో మతాన్ని ఒక్కో విధంగా చూడటం శ్రేయస్కరం కాదన్నారు.