నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లో కోవైడ్ 19 కరోణా అనే ప్రపంచ విపత్తు ను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పదిమంది జూనియర్ న్యాయవాదులకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున కల్వకుర్తి న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి సమక్షంలో ఆర్థిక సహాయం అందచేశారు. కల్వకుర్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ,సెక్రెటరీ కార్యవర్గ తరఫున 25 వేల రూపాయలు సీనియర్ న్యాయవాది కే శ్రీనివాస్ 25 వేల రూపాయలు మొత్తం 50 వేల రూపాయలు జమ చేసి వీరికి అందించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి .వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ వెంకటరమణ, న్యాయవాదులు అమరేందర్ ,భాస్కర్ రెడ్డి ,జగన్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
previous post