29.7 C
Hyderabad
May 2, 2024 06: 26 AM
Slider ప్రత్యేకం

ప్రేక్షకుల అభినందనల్లో మునిగితేలిన ఐశ్వరరాయ్

#aiswaryarai

బాలివుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన 49వ పుట్టినరోజు సందర్భంగా ముంబయిలోని సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ గణపతి బప్పాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఉన్నారు. ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిషేక్ సోషల్ మీడియాలో ఐశ్వర్య తొలి చిత్రం ‘ఇరువర్’ చిత్రాన్ని పంచుకున్నారు. ఇరువర్’ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు.

1994లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత 1997లో ఈ సినిమాలలో నటించేందుకు వచ్చింది. ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. పోస్ట్‌ను పంచుకుంటూ, అభిషేక్ బచ్చన్, ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రేమ, కాంతి, శాంతి మరియు శాశ్వతమైన విజయం అని కామెంట్ చేశాడు. ఐశ్వర్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు.

దీనికి బదులుగా “ధన్యవాదాలు! మీ అపారమైన ప్రేమ, వెచ్చని శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు… ఎల్లప్పుడూ చాలా ప్రేమ ఇలానే ఉండాలి అని చెప్పింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్ వన్’లో కనిపించింది. ఈ చిత్రానికి కూడా మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో ఐశ్వర్య నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ప్రకాష్ రాజ్, జయం రవి, త్రిష కృష్ణన్, మోహన్ బాబు తదితరులు నటిస్తున్నారు.

Related posts

విజయనగరం రైల్వే స్టేషన్ కు మహర్దశ

Satyam NEWS

డొనేషన్స్: కరోనా కట్టడికై ముందుకు రండి

Satyam NEWS

ఏపీ ఫైబర్‌ నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

Satyam NEWS

Leave a Comment