కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి ని శనివారం పి.టి.ఐ.లలు కలిసి తమ సమస్యలు వివరించారు.
పులివెందుల లో జరిగిన ఈ సమావేశంలో తమ సమస్యలైన వేతనాల పెంపుదల, పార్ట్-టైం పదం తొలగింపు, ఫుల్ టైం విధులు, ఎమ్మార్సీ ల్లో చేస్తున్న పనుల నుంచి మినహాయింపు తదితర సమస్యలను వారు ఎంపితో ప్రస్తావించారు.
వారి సమస్యలపై ఎంపి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆయన కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పీడి కి సిఫార్సు లెటర్ పంపారు.