కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అనుమానంతో గత శనివారం కరోనా పరీక్ష చేయించుకోగా ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ప్రకటన లో వెల్లడించారు. గత పది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేసారు.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, డాక్టర్ సలహా మేరకు 10 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఎవరికైనా వ్యక్తిగతంగా అవసరం ఉంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు.