కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కల్వకుర్తి మున్సిపాలిటీ లో మెరుగైన పౌర సౌకర్యాలు కల్పంచేందుకు వీలుగా స్థానిక వ్యాపార వేత్తలు తమ వంతు సహాయంగా 11 లక్షల రూపాయలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అందచేశారు. ఆ డబ్బును అవసరమైన పనులకు ఉపయోగించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వివరాలు: 1)జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ G. రాంరెడ్డి ద్వారా రూ 5,00,000, 2)పోల విశ్వనాధం రూ. 2,00,000, 3)సూర్యలత కాటన్ మిల్ రూ.2,00,000 4)బాలీశ్వర్ మెడికల్ అసోసియేషన్ రూ.1,00,000, 5)గంప వెంకటేష్ గుప్తా అసోసియేషన్ రూ.50,000,
6)కల్వ మనోహర్ రూ.25,000, 7)జూలూరి రమేష్ బాబు రూ. 50,000, 8)దాచేపల్లి రమేష్ రూ.25,000, 9)కొండూరు గోవర్ధన్ వైస్ ఎంపీపీ రూ.10,000 10)జంగయ్య సేటు రూ.10,000. సహాయం అందించిన దాతలను ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు.