కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఇదేం కర్మ మన రాష్ట్రానికి ముగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్యవిభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డా. చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం లో ప్రతి కార్యకర్త మన రాష్ట్రానికి పట్టిన కర్మను ప్రజలకు ఇంటింటికి తిరిగి వివరించడం జరిగిందని ప్రజలలో తెలుగుదేశం పట్ల విశ్వాసాన్ని పెంచడంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా బాగా కృషి చేశారని అలాగే రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసే తెలుగుదేశం విజయానికి నాంది పలకాలని
పిలుపునిచ్చారు.అనంతరం ఈనెల 22న కాకినాడ తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించే మినీ మహానాడును, అలాగే ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త పాల్గొని మహానాడును విజయవంతం
చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో వాసిరెడ్డి ఏసుదాసు, పెంకే శ్రీనివాస్ బాబా, కరప మండలం తెదేపా అధ్యక్షులు దేవు వెంకన్న, కాకినాడ రూరల్ తెదేపా అధ్యక్షులు రాందేవ్ సీతయ్య దొర, కొల్లా బత్తుల అప్పారావు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.