కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపిపి అశోక్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుయ లక్ష్మీనారాయణ, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, మాజీ జడ్పీటీసీ సాయిరాం, ఎంపీటీసీ బండ కింది సాయిలు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిద్దిరాములు, నాయకులు తోట సాయిలు, సొసైటి వైస్ చైర్మన్ రామిరెడ్డి, గ్రామ పెద్దలు గొపాల్రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.