నేడు 31 జిల్లాల కలెక్టర్లతో జరిగిన సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వచ్చిన మాట కంగ్రాట్స్ కలెక్టర్ శరత్. జాతీయ ఉపాది హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. తెలంగాణలో కామారెడ్డి జిల్లా నెంబర్ 1 గా నిలించినందుకు సంతోషంగా ఉంది.
ఈ మొత్తం సంవత్సరానికి నిర్ధేశించిన లక్ష్యం కోటి 20 లక్షల పనిదినాలకు గాను ఈ రెండు నెలల్లో 90 లక్షల పనిదినాలను జిల్లా యంత్రాంగం సాధించింది. 70 శాతం పనిదినాలు ఈ రెండు నెలల్లో సాధించడం అభినందనీయం. గత సంవత్సరంతో పోలిస్తే కేంద్రం నుండి ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లాకు 70 కోట్లు వస్తే ఈ సారి 146 కోట్లు ఇప్పటికే వచ్చాయి. 75 శాతం లక్ష్యం ఈ రెండు నెలల్లోనే సాధించారు.
33 జిల్లాల్లో ఈ పథకంలో కామారెడ్డి ఆదర్శంగా నిలించింది. వేసవిలో రోజుకు 2.50 లక్షల మంది పనిచేశారు. ఈ సీజన్లో కూడా లక్ష 20 వేల మంది పనిచేశారు. చెరువుల్లోని సారవంతమైన మట్టిని రైతులను సమాయాత్తం చేసి వారి పొలాలకు ఈ మట్టిని తరలించడంతో జిల్లా యంత్రాంగం సక్సెస్ అయ్యింది. జిల్లాలోని 1225 చెరువుల్లో పూడిక తీతపని పూర్తయ్యింది. దాంతో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ను కంగ్రాట్స్ అంటూ అభినందించారు సీఎం కేసీఆర్.