40.2 C
Hyderabad
April 28, 2024 16: 10 PM
Slider నిజామాబాద్

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

#shabirali

నిన్న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్.. నేడు కాంగ్రెస్ లో చేరిక

కామారెడ్డి బీఆర్ఎస్ లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డిపై కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు. దాంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వెంటనే టచ్ లోకి వెళ్లారు. దాంతో రాత్రికి రాత్రి సమీకరణాలు మారిపోయాయి. గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, ఆయన సోదరుడు గడ్డం సురేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం 16 వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీకృష్ణతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. నేటి ఉదయం నేరుగా హైదరాబాద్ వెళ్లి షబ్బీర్ అలీని కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దాంతో పార్టీలో అలజడి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే రాత్రికి రాత్రి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడం, పార్టీలో చేరడం చకచకా జరిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం: అమిత్ షా

Satyam NEWS

గేట్ ధర్నా కు దిగిన కల్వకుర్తి న్యాయవాదులు

Satyam NEWS

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

Leave a Comment