40.2 C
Hyderabad
April 29, 2024 16: 08 PM
Slider విజయనగరం

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం జిల్లా లో త‌ర‌చూ నేరాలు ,హ‌త్య‌లు,జ‌ర‌గ‌డంతో  ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి అవుతున్నారు. తాజాగా జిల్లాలోని భోగాపురం  జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే నాత వ‌ల‌స స‌మీపంలో ఓ యువ‌తి మృత‌దేహం..అతి పూర్తిగా గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ల‌భ్యం కావ‌డం..జిల్లాలోనే ఓ సంచ‌ల‌న‌మైంది. ఈ  నెల 30 వ తేదీన‌ తెల్ల‌వారుజామున గుర్తించిన పోలీసులు…సంఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

జిల్లా కేంద్రం నుంచీ ఎస్పీ ఆదేశాల‌తో ఏఎస్పీ ,విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌నా స్థ‌లికి పూస‌పాటిరేగ ఎస్ఐ జ‌యంతి, అలాగే భోగాపురం సీఐ విజ‌యానంద్ లు చేరుకుని డెడ్  బాడీ వివ‌రాలు క‌నుక్కునే య‌త్నం చేస్తున్నారు.అలాగే జిల్లా కేంద్రమైన విజ‌యన‌గ‌రం నుంచీ  ఎఫ్.ఎస్‌.ఎల్ బృందం…ఘ‌టనా స్థ‌లికి చేరుకుని పూర్తి వివ‌రాలు సేక‌రిస్తో్ంది.

అస‌లు  మృత‌దేహం..వ‌య‌స్సు ఎంత‌..? అటు పూస‌పాటిరేగ‌-డెంకాడ స్టేష‌న్ ల మ‌ద్యే ఎందుకు ప‌డివేసారు..?  మృతురాలు..ఏ గ్రామానికి చెందిన‌దో అన్న వివ‌రాల‌ను తెలుసుకునే య‌త్నం చేస్తున్నారు..పోలీసులు..కాగా పూస‌పాటిరేగ లో ఓ హత్య కేసును ప‌ట్టుకున్న పీపీఆర్ ఎస్ఐ జ‌యంతి…త‌న బృందంలో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ ఆషీసులో.ఆ హ‌త్య కేసు ముద్దాయిల‌ను మీడియా ముందు పెట్టే స‌మ‌యంలోనే…ఈ   గుర్తు తెలియ‌ని యువ‌తి మృత‌దేహం కేసు క‌ల‌క‌లం సృష్టించింది.

ఇదిలా ఉంటే ఆ గుర్తు తెలియ‌ని యువ‌తి మృత‌దేహం అంశంపై ఎస్పీ దీపికా..మీడియాతో మాట్లాడారు.ఈ ఉద‌యం… ఆస‌మాచారం వ‌చ్చింద‌ని… ఘ‌ట‌నా స్థ‌లానికి ఎఫ్ఎస్ ఎల్ బృందం వెళ్లింద‌ని..ఎవ‌రు..?ఎలా..? అన్న కోణంలో పోలీస్ శాఖ ద‌ర్యాప్తు ప్రారంభించింద‌న్నారు. ఇదిలా ఉంటే త‌ర‌చూ జిల్లాలో మహిళ‌లపై దారుణాలు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌శ్న‌కు…ఎస్పీ మాట్లాడుతూ..అలాంటి నేరాల‌ను అరిక‌ట్టేందుకే…త‌మ శాఖ దిశ యాప్ ద్వారా  ఓ వైపు చైత‌న్యం…మ‌రోవైపు మేమున్నామ‌నే ధైర్యం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.

Related posts

గోమాత…హైందవజాతికి మూలాధారం…!

Satyam NEWS

(2022) How Does Benicar Lower Blood Pressure 10 Home Remedies For High Blood Pressure

Bhavani

ప్రీప్లాన్డ్:పిలిచి మరి ప్రియుడితో భర్తను చంపించింది

Satyam NEWS

Leave a Comment