బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు కంగనా రనౌత్ కు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. సాంప్రదాయ దుస్తులతో కంగనా తిరుమల గిరిపై ఆకట్టుకున్నారు. కంగనాకు చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూలు కట్టారు.