స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారని బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతీకారంతో తీసుకువచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పరిశీలించమని ఆయన లేఖలో కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ను తిరస్కరించాలని కోరినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.