26.7 C
Hyderabad
May 3, 2024 09: 11 AM
Slider ప్రత్యేకం

కాపు కులస్తులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

#kapucast

కాపు కులస్తులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాప్రా కాపు కులాల ఐక్యవేదిక అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు కోరారు. కాప్ర కాపు కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజన కార్యక్రమం నాగారం ఎస్ వి నగర్ లోని ల్యాండ్ మార్క్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిల్లలు, పెద్దవారు పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి సుమారు 250 మందికి యాక్షన్ చేశారు. ఈ సందర్భంగా అతిధులను కుల పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, కోశాధికారి ఇ నాగు , మీసల చంద్రయ్య, తెల్ల శ్రీధర్, తెల్ల మురళీధర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఏ సి సి డైరెక్టర్ మరి గోవిందరాజు, సామల వేణు, దాసరి రాము, దేవర కొండ శ్రీనివాస్, g.s. రావు, రాంబాబు, సుబ్బారావు, వివేకానంద నగర్ కాలనీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు తదితరులు లు, పాల్గొన్నారు.

జి. శ్రీనివాసరావు, సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ట్రాజెడీ: దీపం వెలిగిస్తూ ఆరిపోయిన యువతి జీవితం

Satyam NEWS

కేసీఆర్ బి.ఆర్.ఎస్.కు భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Satyam NEWS

Leave a Comment