వనపర్తి జిల్లా నర్సింగాయపల్లి-తాడిపర్తి మధ్యలో ఉన్న కసుమూరు మస్తాన్ బాబా దర్గా నిషన్ దగ్గర 11వ తేదీ బుధవారం గందం మహోత్సవాలు నిర్వహిస్తామని వ్యవస్థాపకుడు ఎండీ.ఖదీర్ తెలిపారు. 12న గురువారంనాడు రాత్రి 7 గంటలకు 26 రబీ ఉల్అవ్వాల్ 1445 హిజిరిఉర్స దీపారాధన కార్యక్రమం ఉంటుందన్నారు. 13న శుక్రవారం నాడు 27 రబీ వుల్ అవుల్ 1445 హిజిరి జారతులు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్