కడప చిన్నచౌక్ పరిధిలో నివసి స్తున్న ఉపాధ్యాయుడు దొంతు శ్రీధర్ (51) సోమవారం తమ ఇంటిలో ఎవరూ లేని సమ యంలో బెడ్ రూంలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఖాజీపేట మండలం పత్తూరులో ఉపాధ్యాయు డిగా పని చేసే వాడు. అతనికి భార్య నవ్యరాణి, ఇద్దరు పిల్లలు వున్నారు. పని ఒత్తిడి వల్లనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్ సీఐ పి.నర సింహారెడ్డి తెలియజేశారు.
previous post