రెండు తెలుగు రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ అనుమతి ఇవ్వాలని సోమవారం తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ను కలిసి సింగిల్ పర్మిట్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిని కలిసిన వారిలో లారీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, కోశాధికారి వేముల భూపాల్,జాయింట్ సెక్రటరీ కోతి సంపత్ రెడ్డి,రాష్ట్ర నాయకులు ఖాజా పాషా తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్