విశాఖ లో మరోసారి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తమ విధులను నిర్వహించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారుల పై పట్టపగలే దాడి చేశారు.
వివరాల్లోకి వెళితే పెందుర్తి మండలం సత్తి వాని పాలెం 355 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన గోడను రెవెన్యూ సిబ్బంది తొలగించడానికి వెళ్లగా అది తెలుసుకున్న స్థానిక వైసిపి నేత దొడ్డి కిరణ్ పెందుర్తి రెవెన్యూ ఆర్ ఐ శివ సచివాలయం విఆర్వో శంకర్ లపై రెవెన్యూ సిబ్బంది పై నానా దుర్భాషలాడుతూ తన అనుచరులతో దాడికి దిగి కొట్టడంతో పాటు జెసిబిని లాక్కున్నారు
మీ అంతు చూస్తానంటూ రెవెన్యూ సిబ్బందిని బెదిరించి ఆగ్రహం వ్యక్తం చేశాడు వైసీపీ నేత కిరణ్. దీంతో చేసేదేమీ లేక భయభ్రాంతులకు గురి అయిన రెవెన్యూ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ వెనుదిరిగారు.. ప్రభుత్వ భూములను కాపాడడానికి వెళ్తే తమపై దాడి చేశారని ఆర్ ఐ శివ కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై దాడి చేసిన వైసిపి నేత దొడ్డి కిరణ్ పై తమ ఉన్నత అధికారులు అయిన ఆర్ డి ఓ మండల రెవెన్యూ అధికారి కి జరిగిన విషయం తెలిపామని అన్నారు. ఈ విషయంపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారుల ఆదేశాలతో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు అయితే ఆర్ ఐ శివ విఆర్ఓ శంకర్ పై దాడికి నిరసనగా రెవిన్యూ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.