40.2 C
Hyderabad
May 2, 2024 16: 06 PM
Slider ప్రత్యేకం

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తాం

#mudiraj

రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను ఓడిస్తామని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నాయకులు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ భవనంలో శుక్రవారం మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి అబ్రబోయిన స్వామి, విద్యార్థి సంఘ నాయకుడు నిజన రమేష్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముదిరాజులను విస్మరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు బీఆర్ఎస్ నుంచి కేవలం 5 సీట్లు కూడా బీఆర్ఎస్ కేటాయించలేకపోయిందన్నారు. తమ నాయకుడు బండ ప్రకాష్ మౌనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాని తెలిపారు. వెలమ వర్గానికి 15 సీట్లు, రెడ్డి వర్గానికి అత్యధిక సీట్లు ఇవ్వడం అహంకారపూరిత చర్య అని దుయ్యబట్టారు. ముదిరాజ్ ల సీట్ల కేటాయింపుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఉన్న సాయి రాష్ట్ర నాయకత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీస సీట్లు ఇవ్వకపోవడం రాజకీయంగా ముదిరాజ్ లను అనగదొక్కే కుట్ర అన్నారు.

ముదిరాజ్ ల ఓట్లు కావాలి కానీ సీట్లు వద్దా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటుతో బుద్ది చెప్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు శివకుమార్, నీలకంఠం, జిల్లా అధ్యక్షుడు విఠల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమేష్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కనకయ్య, నాయకులు సూర్యప్రక్షాష్, కాకర్ల రమేష్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చలికాలంలో కరోనా ప్రబలే అవకాశం చాలా ఎక్కువ

Satyam NEWS

రోడ్డు వేయని కాంట్రాక్టర్ కు ఎదురు డబ్బు ఇచ్చిన కార్పొరేటర్

Satyam NEWS

కమలనాథులకు షాక్ ఇచ్చిన ‘జన’ శ్రేణులు

Satyam NEWS

Leave a Comment