కరోనా వైరస్ రెండో దశ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నందున ప్రజలంతా నోటికి మూతికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
చలికాలం వస్తున్నందున వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నయని ఆయన అన్నారు. స్కూళ్లు కాలేజీలకు వెళ్లే వారు కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలని లేకపోతే దారుణాలు జరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత నెలాఖరు నుంచి పాకిస్తాన్ లో స్కూళ్లు కాలేజీలు తెరిచారు. చలికాలం అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ప్రస్తుతం అల్లా దయవల్ల కరోనా వ్యాప్తి దేశంలో గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు.