శివుడి స్పటిక లింగం ఎక్కడుంటుందీ అంటే కేదార్ నాధ్ లోని అని ఎవ్వరిని అడిగినా చెబుతారు. అటువంటి స్పటిక లింగం ప్రతిష్టబడింది…ఏపీలో. ఉత్తరాంధ్ర లోని విజయనగరం లోని ఎస్వీఎన్ నగర్ లో పశుపథినాథ్ దేవాలయంలో శారదా సేవా సంఘం చే ఆ స్పటిక లింగం ప్రతిష్టించబడింది.
ప్రతీ ఏటా కార్తీక మాసంలో ని అన్ని సోమవారాలలో ఆ పశుపథినాథ్ దేవాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించేవారు. ఈ ఏడాది కార్తీక మాసం నాల్గో సోమవారం సందర్భంగా సాయంత్రాంగం ఆరుగంటలకు దీపాలతో ప్రత్యేక పూజ జరిగింది.
అరగంట సేపు..కేదార్ నాధ్ లో లాగానే ఈ పశుపథినాథ్ దేవాలయం లో ప్రతిష్టింపబడిన స్పటిక లింగానికి విశేష పూజలు జరిగాయి. ఈ మేరకు శారదా సేవా సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు..పశుపథినాథ్ దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. అలాగే దేవాలయంలో ప్రతిష్టంపబడిన ద్వాదశి జ్యోతిర్లింగాలకు కూడా..విశేష పూజలు జరిగాయి.