నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భగా సీనియర్ జర్నలిస్టు భగీరధ రాసిన “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిదాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. గురువారం నాడు ఉపాధ్యక్షులు టి. కిషన్ రావు ఈ సమాచారాన్ని భగీరధకు తెలిపారు. జీవిత చరిత్ర విభాగంలో “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” పుస్తకాన్ని ఎంపిక చేసినట్టు కిషన్ రావు వెల్లడించారు.
ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 29న తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగుతుంది. ఇప్పటికే “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్.టి ఆర్” పుస్తకానికి కమలాకర కళాభారతి, ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ ఎన్. టి .ఆర్ అవార్డులు లభించాయి. ఎన్ .టి .రామారావు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం , ఎన్ .టి .ఆర్ శత జయంతి , ఎన్ .టి .రామారావు జీవితం మీద రాసిన ఈ పుస్తకానికి “ఎన్ .టి .ఆర్ . కీర్తి పురస్కారం లభిస్తుందని ఊహించలేదని భగీరథ ఆనందం వ్యక్తం చేశారు.