37.2 C
Hyderabad
April 30, 2024 13: 33 PM
Slider ముఖ్యంశాలు

Tuwj మేడ్చల్ జిల్లా ద్వితీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

#tuwj

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం అధ్యక్షులు మోతే వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 14న షామీర్పేట తూముకుంట చౌరస్తాలోని మొగుళ్ళ వెంకట్ రెడ్డి గార్డెన్ లో సమావేశం నిర్వహించనున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కాప్రా ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు  జిల్లా ద్వితీయ మహాసభల వాల్ పోస్టర్ను  ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోతే వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు సమావేశంలో పాల్గొని తమ ఐక్యతను బలాన్ని చాటాలని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై  చర్చించనున్నామని తెలిపారు. ఐ జె యు నాయకులతోపాటు రాష్ట్ర యూనియన్ నాయకులు సమావేశంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు, జిల్లా నాయకులు బాలరాజు,జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,  బిక్షపతి,అశోక్, వెంకట్రాంరెడ్డి, అక్బర్, లక్ష్మణ్,నరసింహ, వెంకట్రాంరెడ్డి, మహేందర్ రెడ్డి, సాయిబాబా, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

13న సీఎం జగన్ వైజాగ్ పర్యటన

Satyam NEWS

కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో ఐదు వాహనాలకు వేలం పాట

Satyam NEWS

‌కిడ్నాప్ కేసు ఐదు గంటల్లో ఛేధించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment