దివంగత MLA యడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ జన సమితి అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కిష్టారెడ్డి ఇంటికి బుధవారం ఉదయం వెళ్లిన కోదండరాం ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కిష్టారెడ్డి కుమారుడు చైర్మన్ సత్యంతో కోదండరాం మాట్లాడారు. కిష్టారెడ్డి సోషలిస్టు భావాలతో ఉండేవారని, అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డారని కొనియాడారు.
కరంట్ ఉద్యమాలు, నీళ్ళ పోరాటాలు, కరువు వ్యతిరేక ఉద్యమాలను కిష్టారెడ్డి నడిపించారన్నారు. కోదండరాం తో బాటు తెలంగాణ జన సమితి నాగర్ కర్నూ జిల్లా అధ్యక్షుడు ద్రోణాచార్య, జేఏసీ చైర్మన్ సదానందం గౌడు,TJS రాష్ట్ర కార్యదర్శి శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము గౌడు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వినయ్ కుమార్, భీమేశ్వర్, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.