కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరక్టర్ క్షితిజ నేడు పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, అచ్చంపేట ఫారెస్టు డివిజన్ ఆఫీసర్ ఎం నవీన్ రెడ్డి నేడు కొల్లాపూర్ రేంజ్ను పరిశీలించారు.
చింతపల్లి బేస్ క్యాంపు, పెదవోట్ బేస్ క్యాంప్, పెదవోట్ వద్ద సోలార్ బోర్ వెల్, కొత్తగుండు ఏరియా, సోమశిల అర్బన్ పార్కు పనుల పురోగతిని పరిశీలించారు. కొల్లాపూర్ రేంజ్ లో అగ్నిమాపకం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నీరు లభ్యత తదితర అంశాలపై చర్చించారు. రాబోయే వేసవి కాలంలో వన్యప్రాణుల నిర్వహణకు సంబంధించి ఫీల్డ్ డైరెక్టర్ ATR సూచనలను అందించారు.