హైదరాబాద్ అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాగ్ అంబర్ పేట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి నేడు ప్రారంభించారు. పోచమ్మ బస్తీలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు కమ్యూనిటీ హాల్స్ ను ఆయన ప్రారంభించారు.
ప్రజల సౌకర్యం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్వామి దయానంద్ అసోసియేషన్ పెద్దలు కందూరి దశరథ, ధనంజయ, దేశం పండు, రంగం పల్లి రాజు, ఈశ్వర్, శ్రీనివాస్, కంచె చంద్రశేఖర్, కపిల్ దేవ్, జితేంద్ర గౌడ్, సురేందర్ గౌడ్, దాడిగే జగన్, శ్రావణ్, లక్ష్మణ్, దేవేందర్, మహేందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.