అక్రమంగా వలలతో మత్స్య సంపద తరలిస్తున్నారని సమాచారంతో కొల్లాపూర్ అటవీశాఖ అధికారి శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చీమల తిప్ప పరిసర ప్రాంతాల్లో బోట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వలలను పట్టుకున్నారు.
వలలతో అక్రమంగా మత్స్య సంపదను తరలిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు. సీజ్ చేసిన 3 వలలలో ఒకటి పట్టువల,రెండు లైన్ వలలు ఉన్నట్లు వారు తెలిపారు. . వారితో పాటు సెక్షన్ ఆఫీసర్ కే. సత్యనారాయణ, చింతలపల్లి సెక్షన్ అధికారి యం. వెంకటయ్య, బొల్లారం బీట్ ఆఫీసర్, బోటు సిబ్బంది పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్