30.7 C
Hyderabad
April 29, 2024 05: 21 AM
Slider మహబూబ్ నగర్

పేదలకు నిత్యావసర సరుకులు పంచిన ఎమ్మెల్యే బీరం

MLA Beeram

లాక్ డౌన్ సందర్భంగా  ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి  నిత్యావసర సరుకులు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ ఆపద వచ్చి ఆదుకునేందుకు తాను ఉన్నానని చెప్పారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో మీ కోసం ఈ ఆలోచన చేసి ఉడుతా భక్తిగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించి, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 25 పేద కుటుంబాలకు తన స్వంత డబ్బులు వెచ్చించి నిత్యావసర సరుకులను ఆయన సమకూర్చారు.

కరోనాకు మందు లేదు. మన ఇంట్లో మనం ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు మందు అంటూ అవగాహన కల్పించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related posts

Free Sample _ List Of All Prescription Weight Loss Pills T5 Fat Burning Pills Reviews

Bhavani

మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయలేరు

Satyam NEWS

మల్లు స్వరాజ్యం సంస్మరణ సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment