ప్రమాదవశాత్తూ మరణించిన ఒక రైతు కుటుంబాన్ని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదుకున్నారు. నల్గొండ మండలం చిన్న సూరారం గ్రామానికి చెందిన ముదిరెడ్డి శ్రీనివాస రెడ్డి అనే రైతు పొలంలో పని చేసుకుంటుండగా విద్యుత్ తీగ తగిలింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఆయనపై ఆధారపడిన కుటుంబం కష్టాలలో పడింది. రైతు చనిపోయిన విషయం తెలుసుకున్న పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హుటాహుటిన అక్కడ వెళ్లి రైతు పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చి రూ.50,000 తన వంతు ఆర్థిక సాయం అంద చేశారు. అంతే కాకుండా భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.