కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేట లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. అంబాజీపేట బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరిన నాయకులు స్థానిక తసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతా అనురాధ, కొండేటి చిట్టిబాబు, గొల్లపల్లి సూర్యారావు,పాముల రాజేశ్వరి దేవి, వర్మ డి.బి. లోక్, రఘుబాబు మాలమహానాడు నాయకులు కొల్లి శ్రీనివాస్, కోట బాలకృష్ణ, నుకపెయ్య్ చిన్న, పులిడింది సత్యనారాయణ,కత్తుల బాబులు, గోసంగి సత్యనారాయణ, మై లే ఆనంద రావు,చింతపల్లి వెంకటేశ్వర రావు,జల్లి బాలరాజు, కోట విజయరాజు, బీర్ర రాజారావు స్థానిక సర్పంచ్ పాల్గొన్నారు.
previous post