గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 482 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,44,222 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 4,03,248 మందికి చికిత్స కొనసాగుతోందని, కరోనా నుండి ఇప్పటి వరకు 91,00,792 మంది బాధితులు కోలుకున్నారని హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 1,40,182 మంది మృతి చెందారు. నిన్నఒక్కరోజే 41,970 మంది బాధితులు కోలుకున్నారని, దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 94.37%, మరణాల రేటు 1.45% ఉందని ఆ బులెటిన్లో తెలిపింది.
previous post