కడప జిల్లా లో నేషనల్ హైవేలో అక్రమ కట్టడాలను నేషనల్ హైవే అథారిటీ డి.యి. శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో తొలగింపు కు శ్రీకారం చుట్టారు. జేసిబి తో అక్రమా కట్టడాలను తొలగిస్తున్నారు. కడప జిల్లా పుల్లంపేట బైపాస్ రోడ్డులో అక్రమ కట్టడాలను నేషనల్ హైవే అథారిటీ డి.యి . శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం తొలగింపు కు స్వీకారం చుట్టారు.
గతంలో హైవే తొలగింపులో పట్టాలు ఉన్నవారికి పరిహారం చెల్లించి కట్టడాలు తొలగించారు. హైవే పూర్తి అయిన తరువాత మళ్ళీ యధావిధిగా అక్రమ కట్టడాలు వెలిశాయి. హైవే పై అక్రమ కట్టడాలు వెలియడంతో తో వైస్సార్ సర్కిల్ వద్ద తరచు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు. దీనితో గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. ఇటీవల పలుమార్లు యన్.హెచ్ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి అక్రమాకట్టడాలు కట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువు తీరిపోవడంతో, పలుమార్లు తొలగింపుపై నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో పోలీసు సిబ్బంది తో కలసి స్వయంగా యన్.హెచ్ అధికారులు రంగంలోకి దిగి జేసిబి తో అక్రమాలు తొలగింపు కు శ్రీకారం చుట్టారు. పుల్లంపేట తో పాటు హైవేకిరువైపులా అక్రమాలను తొలగించనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ డి.యి . శ్రీనివాసమూర్తి తెలిపారు.