సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మఠంపల్లి,బక్కమంతులగూడెం,చౌటపల్లి, గ్రామంలో మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటారు.
అనంతరం మండల కేంద్రంలో నూతన సి సి రోడ్లలకు శంకుస్థాపన చేసి,కళ్యాణ లక్ష్మీ, షాధిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్ ఎ సి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండల, గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్