ఐఎన్ టీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ఆటో డ్రైవర్ల యూనియన్ సభ ఖమ్మం నగరం వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ లో ఈనెల 7న జరుగుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు తెలిపారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన ఐఎన్ టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సభలో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలతో పాటు కిమ్స్ హాస్పిటల్ తరుపున 50శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను పొంగులేటి చేతుల మీదుగా అందించనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు కూడా అతిథులుగా పాల్గొంటారన్నారు.