వనపర్తి జిల్లా చిన్నంభావి మండల కేంద్రంలోని వెల్టూర్ గ్రామంలో సమ్మర్ సందర్భంగా కీర్తిశేషులు కొత్త మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో kMR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన తాలూక స్థాయి కార్కు బాల్ క్రికెట్ పోటీలలో మొదటి విజేతగా కుడికిళ్ళ టీం 20000వేల రూపాయలతో పాటు షీల్డ్,మరియు ద్వితీయ బహుమతిగా పెంట్లవెళ్ళి 10000 వేల రూపాయలతో పాటు షీల్డ్ లను అందజేశారు
కొత్త కళ్యాణ్ రావుగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని ఇలాగే ఆటలు ఆడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులతో పాటు గ్రామ పెద్దలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.