గత కొద్దిరోజుల క్రితం గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురైన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కోలుకుంటున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన పడొద్దని దేవుడు దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు. గుండె పోటు కారణంగా ఆయన కొద్ది రోజుల కిందట హనుమకొండ అజారా హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. అజారా హాస్పిటల్ డాక్టర్ల తో బాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో అన్ని టెస్టులు నార్మల్ గా వచ్చాయని తెలిపారు. కార్డియలజి, న్యూరాలజీ టెస్ట్ చేయగా నార్మల్ రిపోర్ట్ వచ్చి ఆరోగ్యంగా ఉన్నాను అని తెలిపారు. గుండెకు సంబంధించిన మరికొన్ని రిపోర్టులు రావాల్సివుంది అన్నారు. డాక్టర్ సూచనల మేరకు 15 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని తదనంతరం ములుగు జిల్లా పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాను ఎవరు ఆందోళన పడొద్దు..వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ప్రకటనలో కోరారు.