ఐఐటీ నీట్ ఫోరం కన్వీనర్ కె.లలిత్ కుమార్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నారు. విద్యారంగంలో తనదైన శైలిలో విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు అవసరమైన గైడెన్సును ఉచితంగా అందించే లలిత్ కుమార్ ను నాగబైరవ నీట్ అకాడమీ గౌరవ సలహాదారుడుగా నియమించింది.
ఈ మేరకు నాగభైరవ నీట్ అకాడమీ చైర్మన్ నాగభైరవ వీరబాబు నేడు ఆయనకు సమాచారం అందించారు. ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన నాగభైరవ నీట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నుంచి పని చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది విద్యార్ధులు నాగభైరవ నీట్ అకాడమీలో చదువుతున్నారు.
ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు విద్యార్ధులకు మార్గదర్శనం చేసే బాధ్యతను నాగభైరవ నీట్ అకాడమీ వారు ఐఐటీ నీట్ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ కు అప్పగించారు.