25.7 C
Hyderabad
May 9, 2024 10: 23 AM
Slider ఆధ్యాత్మికం

14 కళ్యాణ మండపాలు లీజుకు టీటీడీ నిర్ణయం

#LordBalaji

చిత్తూరు జిల్లాలోని 14 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు అక్టోబరు 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా www.tender.apeprocuerment.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు. జిల్లాలోని గుడిపాల, పొలకల, పలమనేరు, కల్లూరు, పుంగనూరు, సదుం, సోమల, రొంపిచెర్ల, భాకరాపేట,తరిగొండ, పుత్తూరు, బలిజకండ్రిగ, తిరుమలరాజ పురం, తొండమనాడు కళ్యాణ మండపాలు టీటీడీ లీజుకు ఇవ్వనుంది. ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurment. gov.in లేదా 08772264174, 0877 2264174 ఫోన్ లో సంప్రదించవచ్చు.

Related posts

భూ ఆక్ర‌మ‌ణ‌లపై అధికారుల చోద్యం

Sub Editor

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై వేటు

Satyam NEWS

హోసూర్‌-బెంగుళూరు మధ్య మెట్రోరైలు

Murali Krishna

Leave a Comment