శాంతియుత ప్రజా సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్న డా౹౹చదలవాడ అరవింద బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ప్రజా సమస్యలను తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ప్రజా పాలనలో విఫలమై నరసరావుపేట నియోజకవర్గంలో విగ్రహాల గొడవలు,ఫ్లెక్సీల గొడవలు పెడుతున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. చేతనైతే పాలించాలి లేకుంటే మాకు ప్రజా సంక్షేమ పాలన చేతకాదని ఎమ్మెల్యే ఒప్పుకోవాలి గాని శాంతియుతంగా పచ్చగా ఉండే పల్లెల్లో గొడవలు సృష్టిస్తూ టీడీపీ నాయకులు,కార్యకర్తల పై అరాచకాలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు.
నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని టీడీపీ నాయకులు,కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చామని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు,కార్యకర్తల పై అనవసరంగా గొడవలు పెట్టుకుంటుంటే సహించేది లేదని అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమవడం బాధాకరమని నరసరావుపేట నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటం లేదని తక్షణమే గుంటూరు జిల్లా ఎస్పీ,రాష్ట్ర డీజీపీ దృష్టిసారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెరికాల రాయప్ప, బాషా, సుభానీ, బడే బాబు, మతంగి బంగారం తదితరులు పాల్గొన్నారు.