ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, పట్టభద్రులు అందరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ జన సమితి పార్టీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. బిక్షం నాయక్ కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో గురువారం తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని వాల్ పోస్టర్ విడుదల చేశారు.
అనంతరం తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షం నాయక్ మాట్లాడుతూ పాత ఓటర్లతో పాటు, 2017 వ, సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తయిన వారందరూ తప్పకుండా తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.
నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు ఇది సరైన సమయమని, ఈఅవకాశాన్ని ప్రతి ఒక్క పట్టభద్రుడు ఉపయోగించుకొని ప్రొఫెసర్ కోదండరాం ను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి. సాయి,యం. చందు, కళ్యాణ్, నరేష్, శ్రీను, పవన్, నాస తదితరులు పాల్గొన్నారు.