42.2 C
Hyderabad
May 3, 2024 18: 25 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానంలో లక్ష బిల్వార్చన

srikalahasti

దక్షిణ కైలాసంగా పేరుపొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భgగా లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరిగింది. నేటి నుంచి 25వ తేదీ వరకు శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఉదయం 1వ, 2వ, 3వ కాలం అభిషేకానతరం, 4వ కాలం ప్రదోషకాల అభిషేకానతరం నిర్వహిస్తారు. వేదపండితుల మంత్రాల నడుమ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, స్వామి అమ్మవారిని వివిధరకాల పులతో అలంకరించి అనంతరం స్వామి అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అశేష భక్తజనం పాల్గొని స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు.

Related posts

లారీ ఢీకొని కారు దగ్ధం: వ్యక్తులు నలుగురు సజీవ దహనం

Satyam NEWS

కాలుష్య కారక దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్ జి టి నోటీసు

Satyam NEWS

కేసీఆర్‌కు దమ్ముంటే ఈటలపై పోటీ చేయాలి

Bhavani

Leave a Comment