దక్షిణ కైలాసంగా పేరుపొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భgగా లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరిగింది. నేటి నుంచి 25వ తేదీ వరకు శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఉదయం 1వ, 2వ, 3వ కాలం అభిషేకానతరం, 4వ కాలం ప్రదోషకాల అభిషేకానతరం నిర్వహిస్తారు. వేదపండితుల మంత్రాల నడుమ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, స్వామి అమ్మవారిని వివిధరకాల పులతో అలంకరించి అనంతరం స్వామి అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అశేష భక్తజనం పాల్గొని స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు.
previous post